News March 16, 2025
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News March 16, 2025
ఇష్టం లేని కోర్సులో విద్యార్థిని.. భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టమైన సైన్స్ కోర్సులో కాకుండా ఆర్ట్స్లో చేరినట్లు బిహార్కు చెందిన ఖుష్భూ ఓ ఇంటర్వ్యూలో కన్నీరుమున్నీరయ్యారు. ఇది కాస్త కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి చేరడంతో ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. సైన్స్ కోర్సులో చేరమని, డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవాలని తెలిపారు. కాగా టెన్త్ పరీక్షల్లో 500కు 399 మార్కులు రాగా పేదిరికం వల్ల ఆమె పేరెంట్స్ ఆర్ట్స్లో చేర్పించారు.
News March 16, 2025
శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2025
IMLT20: ఇండియా మాస్టర్స్ టార్గెట్ ఎంతంటే?

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 ఫైనల్లో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. సిమ్మన్స్(57), డ్వేన్ స్మిత్(46) మినహా ఆ జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వినయ్ 3, నదీమ్ 2, బిన్నీ, పవన్ తలో వికెట్ తీశారు. ఇండియా మాస్టర్స్ టార్గెట్ 149.