News April 5, 2025
అనకాపల్లి జిల్లాలో పిడుగులు కూడిన వర్షాలు

నిన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఏపీ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశాపై సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉండటంతో బలహీనపడి ఉందని ఈ ప్రభావంతో జిల్లాలో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 5, 2025
రెండో దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలం: నారాయణ

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.
News December 5, 2025
MHBD: సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా కోతుల బెడద

సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో గ్రామపంచాయతీలు నడిచాయి. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో MHBD జిల్లాలో ఫస్ట్, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 3వ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు కోతులు, కుక్కల బెడద సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా మారింది. పరిష్కరిచిన వారికీ ఓట్లు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు.
News December 5, 2025
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


