News March 17, 2025
అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.
Similar News
News November 15, 2025
IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.
News November 15, 2025
బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

TG: కూకట్పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్వర్డులు సంపాదించారు. వందల హార్డ్డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
News November 15, 2025
21న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 21న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జడ్పీ కార్యాలయ హాలులో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాలకు అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.


