News March 17, 2025
అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.
Similar News
News November 11, 2025
పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
News November 11, 2025
ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సునీల్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
ప్రొటో’కాల్’ భీమేశ్వరాలయానికే పరిమితం..!

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో PRO కార్యాలయం ద్వారా లభించే ప్రొటోకాల్ సేవలు భీమేశ్వరాలయానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే VIPలు, ప్రజాప్రతినిధులు, సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు పీఆర్ఓ కార్యాలయం ద్వారా సిబ్బందిని కేటాయించి రాజన్న దర్శనానికి పంపించేవారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న ఆలయంలో ఒకే క్యూలైన్ ద్వారా దర్శనాలు సాగుతుండడంతో ప్రొటోకాల్ సేవలు నిలిచిపోయాయి.


