News March 17, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.

Similar News

News January 1, 2026

హోంగార్డులను ప్రశంసించిన ఎస్పీ

image

హోంగార్డులకు జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్ అప్రిసియేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జగన్, ఆరే రాఘవరావు, ఆర్‌ఎస్‌ఐ గౌస్ పాషా, టీఆర్‌ఎస్ వెంకటనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డుల సేవలను జిల్లా పోలీస్ శాఖ అభినందించింది.

News January 1, 2026

మత్తులో మునిగిన కరీంనగర్.. జగిత్యాలదే పైచేయి!

image

ఇయర్ ఎండింగ్ డే సెలబ్రేషన్స్‌తో పల్లెలు, పట్టణాలు నిషాతో మత్తెక్కాయి. రికార్డు స్థాయిలో లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఉమ్మడి KNRలో DEC 31న ఒక్కరోజే రూ.25.67 మద్యం అమ్ముడుపోయింది. PDPL- రూ.7.27 కోట్లు, KNR-రూ.7.24 కోట్లు, సిరిసిల్ల రూ3.10 కోట్లు, JGTL- రూ.8.07 కోట్ల లిక్కర్ IML డిపో నుంచి డిస్పాచ్ అయింది. ఎక్సైజ్ అధికారులు రూ.33.34కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని అంచనావేయగా ఈసారి టార్గెట్ రీచ్ కాలేదు.

News January 1, 2026

రామగిరి: అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

image

పెద్దపల్లి(D) రామగిరి(M) నాగేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఎరుకల రాజేశం(60) గురువారం మధ్యాహ్నం మృతి చెందగా, కుమారుడు శ్రీకాంత్ (37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కొడుకులు అరగంట వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.