News March 7, 2025

అనకాపల్లి జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా వాసులు ఎక్కువగా విశాఖ, శ్రీకాకుళం వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, సిక్కోలు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News December 28, 2025

బుల్డోజర్ వివాదం.. సీఎం Vs సీఎం

image

బెంగళూరులో ఇళ్ల కూల్చివేత కర్ణాటక, కేరళ CMల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘నార్త్ బుల్డోజర్ జస్టిస్’ను కర్ణాటక అనుసరిస్తోందని కేరళ CM విజయన్ ఆరోపించారు. ముస్లిం ఇళ్ల కూల్చివేతలు మైనారిటీ వ్యతిరేక రాజకీయాలకు ఉదాహరణని మండిపడ్డారు. ‘ఆయనవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు. వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా మాట్లాడారు. బుల్డోజర్ న్యాయానికి, ఆక్రమణల తొలగింపునకు తేడా ఉంది’ KA CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు.

News December 28, 2025

వాళ్లు బట్టతల ఉన్నోళ్లకూ దువ్వెన అమ్మగలరు: దిగ్విజయ్

image

అద్వానీ, మోదీ <<18686086>>ఫొటోను<<>> కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ షేర్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలపై దిగ్విజయ్ స్పందించారు. సంఘ్ భావజాలాన్ని వ్యతిరేకిస్తానని, ఆ సంస్థ రాజ్యాంగాన్ని ఫాలో కాదని ఆరోపించారు. RSS కార్యకర్తలు బట్టతల ఉన్న వ్యక్తులకూ దువ్వెనలు అమ్మగలరని ఎద్దేవా చేశారు. వాళ్లు చాలా తెలివైన వాళ్లని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలా పని చేయాలన్నారు.

News December 28, 2025

కామారెడ్డి: కొత్త ఏడాదిలో కొత్త వ్యూహాలతో ముందుకు: SP

image

రానున్న సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రజలందరికీ శాంతిభద్రతలతో కూడిన సురక్షితమైన సమాజాన్ని అందించడమే తమ ప్రాధాన్యత అని ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ వివరించారు.