News February 11, 2025
అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి రవాణా కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాకవరపాలెం మండలం పైడిపాల జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి గుర్తించామన్నారు. ఆ వాహనంలో 515 కేజీల గంజాయి పట్టుబడిందని.. దాని విలులు రూ.25,75,000 ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందుతులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
Similar News
News December 8, 2025
ఏజెంట్ స్పేస్లో డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని అన్ని శాఖల వారు ఏజెంట్ స్పేస్లో డాక్యుమెంట్ అప్లోడ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇప్పటివరకు సర్వే శాఖ లక్షకు పైగా, కలెక్టరేట్ ద్వారా 55 వేలు మాత్రమే అప్లోడ్ చేశారని ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ దేవాదాయ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ, విద్యాశాఖ, టౌన్ ప్లానింగ్, మైనారిటీ సంక్షేమ శాఖ, తదితర శాఖలు ఒక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయలేదని, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.


