News February 11, 2025
అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి రవాణా కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాకవరపాలెం మండలం పైడిపాల జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి గుర్తించామన్నారు. ఆ వాహనంలో 515 కేజీల గంజాయి పట్టుబడిందని.. దాని విలులు రూ.25,75,000 ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. నిందుతులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
Similar News
News March 21, 2025
వామ్మో.. లండన్ కాదు దొంగల డెన్!

లండన్ అనగానే చక్కటి అందాలు మనకు గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా లండన్ చోరీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన ఏడాది కాలంలో 83వేల ఫోన్లు చోరీకి గురయ్యాయి. లండన్ వీధుల్లో చేతుల్లో ఫోన్ పెట్టుకుని నడిస్తే ఇక ఫోన్ పోయినట్లేనని స్థానికులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గడచిన వారంరోజుల్లో 230మంది దొంగల్ని అరెస్ట్ చేశారు.
News March 21, 2025
నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
News March 21, 2025
APPSC పరీక్షల తేదీలు ప్రకటన

AP: పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు <