News February 13, 2025

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు

image

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.

Similar News

News November 25, 2025

₹5వేల నోటు రానుందా? నిజమిదే

image

RBI కొత్తగా ₹5వేల నోట్లను విడుదల చేయబోతోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ₹5,000 నోట్లకు సంబంధించి RBI ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం RBI సైట్‌ను విజిట్ చేయాలని సూచించింది. కాగా 2016లో కేంద్రం ₹500, ₹1000 నోట్లను డీమానిటైజ్ చేసి, ఆ తర్వాత ₹2,000 నోట్లను తీసుకొచ్చింది. వాటిని 2023 మేలో ఉపసంహరించుకుంది.

News November 25, 2025

సోన్: దుబాయ్‌లో భర్త హత్య.. భార్యకు టీచర్ ఉద్యోగం

image

దుబాయ్‌లో హత్యకు గురైన నిర్మల్ జిల్లా సోన్ గ్రామవాసి ప్రేమ్ సాగర్ భార్య ప్రమీలకు ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగం లభించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం ప్రవాసి ఈ ప్రజావాణిలో ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సోమవారం ప్రమీల సోన్ మండలం కూచన్ పల్లిలో పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్‌గా ఉద్యోగంలో చేరారు.

News November 25, 2025

మెదక్‌: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.