News February 13, 2025
అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.
Similar News
News October 26, 2025
కరీంనగర్: విద్యాసాగర్కి డాక్టరేట్..!

శాతవాహన విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి కె.విద్యాసాగర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాగర్ పరిశోధన గ్రంథం ప్యాటర్న్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్డిచర్ ఆన్ ఎడ్యుకేషన్: ఏ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేశారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి డా.కోడూరి శ్రీవాణి పర్యవేక్షణలో డాక్టరేట్ అందజేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
News October 26, 2025
MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్లైన్లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
News October 26, 2025
నెత్తురోడుతున్న ‘సికింద్రాబాద్’ రైల్వే పట్టాలు

సికింద్రాబాద్ పరిధిలో రైల్వే పట్టాలు నెత్తురోడుతున్నాయి. SEC రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, 400 వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు శోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.


