News April 7, 2025

అనకాపల్లి జిల్లాలో యువకుడి హత్య

image

రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మేడివాడకి చెందిన కొలిపాక పవన్ కుమార్(22) హత్యకు గురై మరణించాడు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ, అనకాపల్లికి చెందిన క్లూస్ టీం ఘటనా స్థలం చేరుకొని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఫోన్ కొనేందుకు ఆదివారం పవన్ రావికమతం వచ్చినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 23, 2025

ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

image

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.

News April 23, 2025

లింగంపేట్: దరఖాస్తులను క్యాటగరీ వారీగా నమోదు చేయాలని: కలెక్టర్

image

లింగంపేట్ మండలంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగరీల వారీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం లింగంపేట్ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుల నమోదు తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో సదస్సులు నిర్వహించి 1080 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఈ దరఖాస్తులపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News April 23, 2025

ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

image

AP: పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!