News March 23, 2025

అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

image

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 5, 2025

వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

image

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్‌ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News December 5, 2025

గురు భవానీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఈవో

image

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. డిసెంబర్ 11–15 వరకు సేవలందించే గురు భవానీలు తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం Google Play Storeలో Bhavani Deekshalu యాప్ అందుబాటులో ఉందని, గుర్తింపు పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు.

News December 5, 2025

JGL: 941మంది సర్పంచ్ స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 14న జరిగే 2 విడత ఎన్నికల్లో జరిగే 7మండలాల్లో మొత్తం 144 సర్పంచ్, 1276 వార్డు స్థానాలు ఉన్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 144 సర్పంచి స్థానాలకు గాను, మొత్తం 941 మంది, అలాగే 1276 వార్డు స్థానాలకు గాను, మొత్తం 2927 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 14న జరిగే 2వ విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.