News April 1, 2025

అనకాపల్లి జిల్లాలో 157 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 157 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,679 మంది హాజరైనట్లు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 256 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 194 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 16, 2025

KNR: మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

image

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యాసంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి.వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలని సూచించారు. 18వ తేదీన సీటు కేటాయించనున్నట్లు తెలిపారు.

News November 16, 2025

KNR: ప్రశాంతంగా డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 5వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 9999 విద్యార్థులకు గాను 9722 మంది విద్యార్థులు హాజరయ్యారు. 277 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 3వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 8676 విద్యార్థులకు గాను 8425 మంది విద్యార్థులు హాజరయ్యారు. 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

News November 16, 2025

జగిత్యాల: పలువురు ఎస్‌ఐలకు కొత్త పోస్టింగ్‌లు

image

జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి SHO పి.ఉదయ్ కుమార్‌ను వెల్గటూర్ SHOగా, జగిత్యాల రూరల్ SHO ఎన్.సదాకర్‌ను జగిత్యాల DCRBకి, వెల్గటూర్ SHO ఆర్.ఉమాసాగర్‌ను జగిత్యాల రూరల్ SHOగా బదిలీ చేశారు. భీమ్గల్ PS SI–I జి.మహేష్‌ను ధర్మపురి SHOగా నియమించారు. బదిలీ అయిన ఎస్‌ఐల రిలీవ్ తేదీలను వెంటనే రిపోర్ట్ చేయాలని SP సూచించారు.