News April 1, 2025
అనకాపల్లి జిల్లాలో 157 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 157 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,679 మంది హాజరైనట్లు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 256 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 194 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
TDP జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి అనంత కుమారి ఇటీవల బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త సారథిని ఎంపిక చేయాలని టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా, బీసీలకు కాకుండా వేరొక సామాజిక వర్గానికి ఈ కీలక పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
News October 14, 2025
రాజోలు: అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయమేనా..?

రాజోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించడం చర్చనీయాంశమైంది. గొల్లపల్లి అభిమానులను టీడీపీ వైపు తిప్పుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరోవైపు తనయుడు శ్రీధర్కు కోఆర్డినేటర్ ఇవ్వాలని గొల్లపల్లి జగన్ను కోరడంతో.. రాజోలు బరిలో అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయంగా కనిపిస్తోంది.
News October 14, 2025
వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>