News March 11, 2025
అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్కు సంబంధించి 2,406 మంది, జనరల్కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 25, 2025
ASF కార్మికుల బీమా పెంపు

భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కార్మిక భీమా పెంపు, కార్మికుల సంక్షేమంపై కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సహజ మరణానికి అందించే సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
News November 25, 2025
₹5వేల నోటు రానుందా? నిజమిదే

RBI కొత్తగా ₹5వేల నోట్లను విడుదల చేయబోతోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని, ₹5,000 నోట్లకు సంబంధించి RBI ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం RBI సైట్ను విజిట్ చేయాలని సూచించింది. కాగా 2016లో కేంద్రం ₹500, ₹1000 నోట్లను డీమానిటైజ్ చేసి, ఆ తర్వాత ₹2,000 నోట్లను తీసుకొచ్చింది. వాటిని 2023 మేలో ఉపసంహరించుకుంది.
News November 25, 2025
సోన్: దుబాయ్లో భర్త హత్య.. భార్యకు టీచర్ ఉద్యోగం

దుబాయ్లో హత్యకు గురైన నిర్మల్ జిల్లా సోన్ గ్రామవాసి ప్రేమ్ సాగర్ భార్య ప్రమీలకు ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగం లభించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం ప్రవాసి ఈ ప్రజావాణిలో ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సోమవారం ప్రమీల సోన్ మండలం కూచన్ పల్లిలో పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్గా ఉద్యోగంలో చేరారు.


