News March 11, 2025

అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్‌కు సంబంధించి 2,406 మంది, జనరల్‌కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News December 13, 2025

ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

image

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.

News December 13, 2025

WGL: డబ్బులు అడిగిన విలేకరులను చితకబాదిన నేతలు!

image

వరంగల్ శివారులో రెండో విడత ప్రచారానికి కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా కంట్రిబ్యూటర్లు ప్రచారం ముగిసిన అనంతరం మామూళ్లు అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బుల విషయంలో వివాదం చెలరేగగా, ఆగ్రహించిన పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని తరిమినట్లు సమాచారం. గ్రామశివారు వరకు వెంబడించి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా ఓ MLA ఆదేశాలతో ఇరుపక్షాలు రాజీ పడ్డాయి.

News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.