News March 11, 2025

అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్‌కు సంబంధించి 2,406 మంది, జనరల్‌కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News November 16, 2025

RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.

News November 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

☛ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు.. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే (NOV 27) థియేటర్లలోకి సినిమా.. ఈ నెల 18న ట్రైలర్
☛ నాగార్జున ‘శివ’ రీరిలీజ్‌కు 2 రోజుల్లో ₹3.95Cr గ్రాస్ కలెక్షన్స్
☛ నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా త్వరలో సినిమా: సినీ వర్గాలు
☛ ధనుష్ డైరెక్షన్‌లో రజినీ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం: తమిళ సినీ వర్గాలు

News November 16, 2025

గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.