News March 11, 2025

అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్‌కు సంబంధించి 2,406 మంది, జనరల్‌కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News November 20, 2025

₹600Crతో TG పోలీసు AMBIS అప్‌గ్రేడ్

image

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్‌గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.

News November 20, 2025

మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

image

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.

News November 20, 2025

HYD: ఓయూలో “రిక్రూట్‌మెంట్ డ్రైవ్”

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ (HCDC) ఆధ్వర్యంలో సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ కోసం కాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను CFRD భవనంలోని e-క్లాస్‌రూమ్ క్యాంపస్‌లో నిర్వహించారు. OUకి చెందిన ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) ప్రత్యేకతల విద్యార్థులకు మాత్రమే నిర్వహించారు. మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.