News March 11, 2025

అనకాపల్లి జిల్లాలో 601 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 601 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారిణి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 14,462 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 13,861 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్‌కు సంబంధించి 2,406 మంది, జనరల్‌కు సంబంధించి 11,455 మంది హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News December 2, 2025

VKB: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం

image

జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం తెలిపారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు ప్రతి వారం ఒక్క ప్రత్యేక థీమ్‌తో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News December 2, 2025

VKB: డీసీసీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్న ధారాసింగ్

image

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ధారా సింగ్‌కు ఆమె నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

News December 2, 2025

KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.