News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 85 శాతం పోలింగ్: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం ముగిసే సరికి 85 శాతం పోలింగ్ పూర్తయినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 357 పురుషుల ఓటర్లలో 273 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 257 మహిళా ఓటర్లలో 202 మంది తమ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News November 24, 2025
MHBD ఎంప్లాయిమెంట్స్ కార్యాలయంలో జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో, క్రెడిట్ ఆక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, కంపెనీలో కేంద్ర మేనేజర్ ఉద్యోగాల ఎంపికకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రజిత తెలిపారు. అర్హత కల్గిన నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 26న ఉదయం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆమె కోరారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
డ్రగ్స్ కేసుల్లో గత 16 నెలల్లో 2,467 మంది అరెస్ట్: DIG

గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు 1000 కి.మీ ‘అభ్యుదయం సైకిల్ ర్యాలీ’ చేపట్టామన్నారు.


