News August 26, 2024
అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయి స్వాధీనం

లారీలో అక్రమంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని సబ్బవరం మండలం గుల్లేపల్లి జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా వస్తున్న లారీపై ఆదివారం పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుపడగా, మరో ఐదుగురు పరారైనట్లు తెలిపారు.
Similar News
News April 16, 2026
విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
News April 16, 2026
సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.


