News March 1, 2025

అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.

Similar News

News October 25, 2025

RMG: ‘అమృత్ పథకంలో స్వశక్తి మహిళలకు అవకాశం’

image

అమృత్ మిత్ర ఇన్షియేటివ్‌లో భాగంగా నీటి సరఫరా నిర్వహణ, నాణ్యత పరీక్ష, లీకేజీల మరమ్మతు వంటి పనుల్లో స్వశక్తి మహిళలకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్, RGM కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. అమృత్ 2.0 కింద రూ.65 లక్షలతో ఏడు ప్యాకేజీల పనులు స్వశక్తి సభ్యులతో చేపట్టి ఉపాధి కల్పిస్తామని, అవసరమైన శిక్షణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా అందిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు

News October 25, 2025

ఆసిఫాబాద్: సైబరాసురులతో జాగ్రత్త

image

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సైబర్ మోసగాళ్లు వినూత్న పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కాగజ్‌నగర్‌లో క్రెడిట్ కార్డుకు సంబంధించిన నకిలీ కాల్స్‌ ద్వారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.90 వేలు, ఒక ఉద్యోగి నుంచి రూ.70 వేలు, మరో చిరు వ్యాపారి నుంచి రూ.70 వేలు కొట్టేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 25, 2025

SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

image

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.