News March 1, 2025

అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.

Similar News

News November 15, 2025

GWL: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలన్నారు. రైతులకు ముందస్తుగా తేమశాతం పై ఏఈఓ లు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన పత్తి, ధాన్యం కేంద్రానికి వచ్చే విధంగా చూడాలన్నారు.

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

image

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.