News February 2, 2025

అనకాపల్లి జిల్లాలో 94.79 శాతం పెన్షన్‌ పంపిణీ పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి 7.10 గంటల వరకు 94.79 శాతం పెన్షన్‌లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మండలంలో 97.94 శాతం మందికి పెన్షన్ అందజేశామన్నారు. రెండో స్థానంలో చోడవరం, 3వ స్థానంలో కసింకోట, 4వ స్థానంలో నర్సీపట్నం ఉన్నాయన్నారు. మిగిలిపోయిన వారికి ఈనెల 3వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News December 9, 2025

పంటు రాకపోకలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

గోదావరి నదిపై పంటు రాకపోకలు రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌ల్యాండ్ వెసెల్స్ యాక్ట్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ పంటు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద జల వనరులు, పంచాయతీరాజ్, ఆర్డీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సోంపల్లి, నర్సాపురం, కోటిపల్లి రేవుల వద్ద పంటు రాకపోకలపై సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చర్చించారు.

News December 9, 2025

GWL: ఎన్నికలకు 28 రూట్ మొబైల్ పార్టీలు: ఎస్పీ

image

గద్వాల జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 106 గ్రామ పంచాయతీలు ఉండగా 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 35 సమస్యాత్మక, 56 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు 28 రూట్ మొబైల్ పార్టీలు, 4 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 4 రూట్ ఇన్చార్జీలుగా 13 మందిని నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామన్నారు.

News December 9, 2025

ములుగు: అన్ని ఏర్పాట్లు చేయండి: EC

image

సజావుగా పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 3,834 పంచాయతీలకు, 27,628 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాకు పోలింగ్ జరుగుతుందన్నారు.