News March 29, 2025
అనకాపల్లి: జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ ప్రారంభం

అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ శనివారం ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ను జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తన కార్యాలయంలో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం వెబ్ సైట్లో ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పదవ తరగతి ఒకేషనల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 4,803 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. 196 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
RGM: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

GDK గౌతమీ నగర్కు చెందిన తిరువీధి శ్యాముల్ కిరణ్ (21) సమీపంలోని రైల్వే ట్రాక్ గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు NTPC SI ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. ITI చదువుతున్న అతడు చదువు మధ్యలో మానేయడంతో తల్లిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తిచెంది నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం గౌతమీనగర్ ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నాడు. తండ్రి కొండలరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 21, 2025
వరంగల్లో దిశా కమిటీ సమావేశం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ‘దిశా’ (జిల్లా అభివృద్ధి సహకార & మానిటరింగ్ కమిటీ) సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News November 21, 2025
ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాలు: కలెక్టర్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మీకోసం రైతన్న కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తూ రైతు అభ్యున్నతికి సూచనలు సలహాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.


