News March 29, 2025
అనకాపల్లి: జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ ప్రారంభం

అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ శనివారం ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ను జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తన కార్యాలయంలో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం వెబ్ సైట్లో ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పదవ తరగతి ఒకేషనల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 4,803 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. 196 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
MNCL జిల్లాలో విషాదం.. యువరైతు ఆత్మహత్య

పంట దిగుబడి వస్తుందో.. రాదోనని కలత చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. పౌనుర్కు చెందిన యువ రైతు కుమార్(29)తన ఎకరం పొలంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మేలు ఫిమేల్ సీడ్ వరి వేశాడు. బోరు ఎండి నీరు అందక ఆవేదన చెందాడు. 3 ఏళ్లుగా పంట సాగులో నష్టాలను చవిచూస్తున్న కుమార్ ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 21, 2025
ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
News April 21, 2025
ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.