News February 7, 2025
అనకాపల్లి: టీచర్పై పోక్సో కేసు నమోదు
బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 8, 2025
మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు
భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.
News February 8, 2025
ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..
జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2025
కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.