News February 7, 2025

అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు

image

బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.

Similar News

News March 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
* ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్
* ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు
* రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR
* AP: పోలవరం నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం: CBN
* 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల
* హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

News March 28, 2025

BREAKING: లక్నో చేతిలో SRH ఓటమి

image

IPL-2025: ఈ సీజన్లో SRHకు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో SRHపై లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 రన్స్ చేసి మ్యాచును తమవైపు లాగేశారు. ఓపెనర్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. కమిన్స్ రెండు వికెట్లు తీశారు.

News March 28, 2025

జగిత్యాల మార్కెట్ ధరల సమాచారం మీ కోసం

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,215, కనిష్ట ధర రూ. 1,918లుగా పలికాయి. అటు కందులు గరిష్ఠ ధర రూ. 6,495, కనిష్ఠ ధర రూ. 5,500, అనుములు రూ. 4896, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 11,000, కనిష్ఠ ధర రూ. 7,000, పసుపు గోళం గరిష్ఠ ధర రూ. 9,500, కనిష్ఠ ధర రూ. 5,000, వరి ధాన్యం (జైశ్రీరాం రకం) రూ. 2,311లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

error: Content is protected !!