News March 20, 2025
అనకాపల్లి: టెన్త్ స్పాట్ వాల్యుయేషన్పై వినతి

10th స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ నుంచి కొందరు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని అనకాపల్లి DEO అప్పారావునాయుడుని PRTU బుధవారం కోరింది. 55సంవత్సరాలు దాటినవారికి, వికలాంగులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి, ప్రత్యేక అవసరాలుగల పిల్లలు ఉన్నవారికి తప్పకుండా మినహాయింపు ఇవ్వాలని PRTU అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ వినతి ఇచ్చారు. వినతిపై DEO సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
Similar News
News December 2, 2025
హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!
News December 2, 2025
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News December 2, 2025
రాజీనామా వెనక్కి తీసుకున్న జకియా ఖానం!

AP: శాసనమండలి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు MLCలను ఛైర్మన్ మోషేన్ రాజు నిన్న పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జకియా ఖానం తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పదవీకాలం 7నెలలే మిగిలి ఉందని, ఎన్నిక నిర్వహించడానికి టైం ఉండదని ఛైర్మన్ చెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగతా MLCలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, సునీత, జయమంగళ, మర్రి రాజశేఖర్లు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.


