News January 30, 2025

అనకాపల్లి: ‘తప్పులు లేకుండా సరిచేసుకోవాలి’

image

ఉపాధ్యాయుల బదిలీలు ఈ ఏడాది జరుగుతాయని అనకాపల్లి డీఈవో జీ.అప్పారావు నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ఉపాధ్యాయుల సీఎస్ఈ వెబ్ సైట్‌లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తప్పులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు తన వ్యక్తిగత లాగిన్(డీడీవో లాగిన్‌)లో తప్పులను ఈనెల 31వ తేదీలోగా సరి చేసుకోవాలన్నారు.

Similar News

News December 9, 2025

గద్వాల్: 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు

image

గద్వాల్ జిల్లాలో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరిగే గట్టు, గద్వాల్, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని పాఠశాలలకు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడుత ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. నేటితో గ్రామాల్లో మైకులు మూగబోనున్నాయి.

News December 9, 2025

పాలమూరు: ఓటు వేయాలంటే 10 కి.మీ నడవాల్సిందే..!

image

నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తీవ్రంగా కష్టపడుతున్నారు. వరహాబాద్, మల్లాపూర్ చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాలి. గిసుగండి ఓటర్లు మద్దిమడుగు రావడానికి కూడా 10 కిలోమీటర్లు నడక తప్పడం లేదు.

News December 9, 2025

ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాత్రుళ్లు పార్టీలు ఇస్తుండటంతో పాటు సిటీలో ఉద్యోగం చేసే వారికి కాల్ చేసి ఛార్జీలు ఇస్తాం రమ్మంటూ ఆఫర్ చేస్తున్నారు. అటు దండాలు పెడుతూ, కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల పిల్లలు, దేవుడిపై ఒట్లు వేయించుకొని మాట తీసుకుంటున్నారు. ఇతర అభ్యర్థులపై నిఘా పెట్టి వారికి పోటీగా ప్రమాణాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు.