News March 17, 2025
అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్లు, యలమంచిలిలో మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Similar News
News December 19, 2025
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఫుట్బాల్ స్టార్!

స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ‘Fast X: Part 2’లో ఆయన కనిపించనున్నారు. రొనాల్డోకు స్వాగతం పలుకుతూ నటుడు టైరెస్ గిబ్సన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
News December 19, 2025
చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.
News December 19, 2025
NTR: లాడ్జిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

విజయవాడ గాంధీనగర్లోని ఓ లాడ్జిలో గురువారం సత్యనారాయణపురం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లాడ్జి కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


