News March 20, 2025

అనకాపల్లి: దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి 

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.

Similar News

News March 22, 2025

BREAKING: కాసేపట్లో భారీ వర్షం

image

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 22, 2025

స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

image

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.

News March 22, 2025

వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు: నాదెండ్ల

image

AP: రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ పాలనలో పంటలు అమ్ముకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తాము ఇప్పటి వరకు రూ.8వేల కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల అకౌంట్లలో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

error: Content is protected !!