News February 25, 2025

అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా పంచకర్ల

image

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న పిఠాపురంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పీఓసీలు పార్టీ మండల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. 

Similar News

News November 28, 2025

బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News November 28, 2025

ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

image

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.

News November 28, 2025

ఖమ్మం: తీగల వంతెన పనులకు జూన్ వరకు గడువు

image

ఖమ్మం నగరానికి కొత్త అందాలను తెచ్చేందుకు రూ.180 కోట్ల వ్యయంతో మున్నేరు నదిపై నిర్మిస్తోన్న తీగల వంతెన నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయి.వర్షాలు,వరదల కారణంగా పనులకు అంతరాయం కలగడంతో, పూర్తి గడువును వచ్చే మార్చి నుంచి జూన్ వరకు పొడిగించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. వంతెన పూర్తయితే శిథిలావస్థలో ఉన్న కాల్వొడ్డు వంతెన,బైపాస్‌పై భారీగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.