News February 26, 2025

అనకాపల్లి నుంచి పోలింగ్ కేంద్రాలకు పయనం 

image

అనకాపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో ఎన్నికల అధికారులు సిబ్బంది పోలీస్ కేంద్రాలకు బుధవారం బయలుదేరారు. 24 పోలింగ్ కేంద్రాలకు 10 రూట్లలలో 10 బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 24 పోలింగ్ కేంద్రాలకు వీరంతా సాయంత్రానికి చేరుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్, మరో ఇద్దరు పోలింగ్ అధికారులను నియమించారు.

Similar News

News February 27, 2025

NGKL: మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

image

నాగర్ కర్నూల్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి మార్చి 2న వనపర్తికి రానున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో జరిగే ఉద్యోగ మేళాకు అతిథిగా సీఎం రానున్నారని మల్లు రవి తెలిపారు.

News February 27, 2025

అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్సీపై బట్లర్ కీలక వ్యాఖ్యలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

News February 27, 2025

నందిపేట్: దుబాయిలో ఉద్యోగాల పేరిట మోసం

image

నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో గల్ఫ్ ఏజెంట్ కస్పా శ్యామ్, మధు, సాయి రెడ్డి, గుడ్ల ప్రకాష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏజెంట్ కస్పా శ్యామ్ దుబాయిలో ఉద్యోగాల పేరిట తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. నలుగురు దాడి చేశారని అమలాపురానికి చెందిన బాధితుడు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

error: Content is protected !!