News March 1, 2025
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం చరిత్ర ఇదే..!

అనకాపల్లి పట్టణం గవరపాలెం కొబ్బరి తోట ప్రాంతంలో 1450లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. 1611లో అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించబడిన అప్పలరాజు పాయకరావు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1937లో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో దేవాలయానికి ఈఓగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఉగాది ముందు రోజు నుంచి నెలరోజుల పాటు జాతర జరుగుతుంది.
Similar News
News December 18, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యలలో రూ.11,08,250 నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. అదేవిధంగా రూ.6,93,858 విలువగల మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News December 18, 2025
MBNR: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: SP

ఈ నెల 21 న జిల్లాలో జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. క్షణికా వేషంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉత్తమ అవకాశమని, రాజీ మార్గానికి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కక్షదారులకు సూచించారు.
News December 18, 2025
భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్పుత్ క్షమాపణలు చెప్పారు.


