News February 10, 2025
అనకాపల్లి: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. జిల్లాలో 35 జూనియర్ కళాశాలలు, 4 మోడల్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 13,969 మంది ప్రాక్టికల్ పరీక్షకు హాజరవుతారన్నారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 27, 2025
సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ తెలిపారు.
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.
News November 27, 2025
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.


