News February 10, 2025
అనకాపల్లి: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. జిల్లాలో 35 జూనియర్ కళాశాలలు, 4 మోడల్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 13,969 మంది ప్రాక్టికల్ పరీక్షకు హాజరవుతారన్నారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 17, 2026
కృష్ణా: ఎండలు హీట్.. బొండాల ధరలు హాట్!

జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శీతల పానీయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు ప్రజలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా లభ్యత తగ్గిపోవడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి బొండాలను కృష్ణా జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.
News March 17, 2026
TU: వర్సిటీ హాస్టల్స్ తనిఖీ చేసిన ఉపకులపతి

టీయూలోని బాలుర, బాలికల హాస్టళ్లను వీసీ ప్రొ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైస్ ఛాన్సలర్, హాస్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. చీఫ్ వార్డెన్ రవీందర్ రెడ్డి ఉన్నారు.
News March 17, 2026
VZM: 22న బాడీ బిల్డర్స్ పోటీలు

యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మంగళవారం మాట్లాడారు. 22న గురజాడ కళాభారతిలో “మిస్టర్ VZM-2026” బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 55 నుంచి 75 కేజీల వరకు 6 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకే పోటీలు నిర్వహిస్తునమన్నారు.


