News March 24, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 18, 2025
సిద్దిపేట: ఒక్క ఓటుతో గెలుపు.. రికౌంటింగ్

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు కర్రోళ్ల నాగరాజు, కొయ్యడ వెంకటేశం మధ్య ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశం సమీప ప్రత్యర్థి పై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
భారీ జీతంతో OICLలో 300 జాబ్స్

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్స్ నిర్వహిస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.250. వెబ్సైట్: orientalinsurance.org.in/
News December 18, 2025
డేంజర్ పురుగు.. మరో ప్రాణం తీసింది!

AP: ‘స్క్రబ్ టైఫస్’తో రాష్ట్రంలో మరో <<18463808>>మరణం<<>> సంభవించింది. అన్నమయ్య(D) పీలేరు మోడల్ కాలనీకి చెందిన మంగమ్మ(60) ఇటీవల తీవ్ర జ్వరానికి గురయ్యారు. కుమారుడు ఆమెను రుయా ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. మంగమ్మ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో అన్నమయ్య జిల్లా వైద్యాధికారులు మోడల్ కాలనీని సందర్శించారు. జ్వర బాధితులకు స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.


