News March 24, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 8, 2025
కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.
News December 8, 2025
చైనా మోడల్లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్

TG: ‘తెలంగాణ రైజింగ్’ నిరంతర ప్రక్రియ అని, అందరి సహకారంతో లక్ష్యాలన్నిటినీ సాధించగలమన్న నమ్మకం ఉందని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్లో TGని అభివృద్ధి చేస్తామని సమ్మిట్లో చెప్పారు. చైనా సహా జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా నుంచి ప్రేరణ పొందామని, వాటితో పోటీపడతామని వివరించారు. విజన్ కష్టంగా ఉన్నా సాధించే విషయంలో నిన్నటికంటే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.
News December 8, 2025
ములుగు: హీటెక్కిన “పంచాయితీ” సమరం

జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న ఏటూరు నాగారం, తాడువాయి, గోవిందరావుపేట మండలాల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. మంత్రి సీతక్క సైతం ప్రచారంలో పాల్గొనడం, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో వాతావరణం హీటెక్కింది.


