News March 22, 2025
అనకాపల్లి: పదో తరగతి పరీక్షకు శతశాతం హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి సంస్కృత పరీక్షకు శత శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 951 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 17, 2025
ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు
News October 17, 2025
పెద్దపల్లి: TASK i4TY 2.0 ఐడియాథాన్కు విశేష స్పందన

TASK ఆధ్వర్యంలో ‘i4TY 2.0’ ఫిజికల్ ఐడియాథాన్ పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ థీమ్పై 3 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 210 మంది విద్యార్థులు 45 ఆవిష్కరణలు ప్రదర్శించారు. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు, డిజిటల్ ఐడియాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఆలోచనలకు మెంటర్షిప్, ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు.
News October 17, 2025
నిజామాబాద్లో కానిస్టేబుల్ దారుణ హత్య

నిజామాబాద్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ను ఓ దొంగ హత్య చేశాడు. ఓ కేసు విషయంలో అరెస్టు చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ను వినాయక్ నగర్లో దొంగ రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.