News March 22, 2025
అనకాపల్లి: పదో తరగతి పరీక్షకు శతశాతం హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి సంస్కృత పరీక్షకు శత శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 951 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
SBIలో 996 పోస్టులకు నోటిఫికేషన్

SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sbi.bank.in
News December 4, 2025
కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.
News December 4, 2025
అమరావతిలో ‘అంతిమ యాత్ర’ చిక్కులు

అమరావతి నిర్మాణంలో ‘శ్మశాన వాటికల’ ఏర్పాటు కొత్త సవాలుగా మారింది. ‘మన గ్రామం-మన శ్మశానం’ అనే సెంటిమెంట్ బలంగా ఉండటంతో, రైతులు గ్రామాల వారీగా శ్మశానాలు కోరుతున్నారు. రాజధాని అభివృద్ధిలో పాత దారులు మూసుకుపోవడంతో సమస్య జఠిలమైంది. హిందూ, ముస్లిం, దళితుల సంప్రదాయాలను గౌరవిస్తూ, హైబ్రిడ్ మోడల్లో 3-4గ్రామాలకు ఒక క్లస్టర్, లేదా కృష్ణా నది ఒడ్డున ఉమ్మడి శ్మశానాల ఏర్పాటుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.


