News March 22, 2025
అనకాపల్లి: పదో తరగతి పరీక్షకు శతశాతం హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి సంస్కృత పరీక్షకు శత శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 951 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
KNR: TGNPDCL డిజిటల్ సేవలు..!

మెరుగైన సేవలకు TGNPDCL యాప్ తీసుకొచ్చింది. దీంతో న్యూకనెక్షన్, సెల్ఫ్ రీడింగ్, పేబిల్స్, బిల్స్ హిస్టరీ, లోడ్ ఛేంజ్, కంప్లైంట్ స్టేటస్ వంటి 20రకాల డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్బాట్ ద్వారా కూడా కరెంట్ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అప్లికేషన్ నమోదు నుంచి సర్వీస్ రిలీజ్ వరకు సేవలు పొందొచ్చు. ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలు ఆస్వాదించాలని అధికారులు కోరుతున్నారు.
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఎలాంటి టోర్నీలు జరగ లేదు.
News November 21, 2025
Way2Newsలో వార్త.. నేడు మంత్రి పర్యటన

రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన Way2Newsలో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజధాని గ్రామాల్లో CITIIS ప్రాజెక్ట్ కింద చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్, హెల్త్ సెంటర్లను పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కాసేపట్లో మంత్రి పర్యటన అప్డేట్ Way2Newsలో చూడొచ్చు.


