News March 23, 2025

అనకాపల్లి: పోలీసుల దర్యాప్తులో అసలు నిజం

image

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15855817>>మర్డర్ మిస్టరీని<<>> ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్‌ను లాలం గణేశ్‌కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్‌ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్‌ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.

Similar News

News December 5, 2025

చిగ్గర్ మైట్ పురుగుతో స్క్రబ్ టైపస్ వ్యాధి: బాపట్ల DMHO

image

స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO విజయమ్మ చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్క్రబ్ టైపస్ కొత్త రకం కాదన్నారు. జ్వరం, తలనొప్పిని ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు వలన వ్యాధి వ్యాపిస్తుందన్నారు. పురుగు కుట్టినచోట నల్లగా మచ్చలు ఏర్పడతాయన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలన్నారు.

News December 5, 2025

14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://examinationservices.nic.in/<<>>

News December 5, 2025

Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

image

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.