News February 20, 2025
అనకాపల్లి: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ రహదారి భద్రత సమన్వయ కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కలర్ పెయింటింగ్ వేయాలన్నారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలన్నారు.
Similar News
News December 25, 2025
సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కుల పంపిణీ

జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమీషన్ రూ.7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు.
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
TPUS జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ రావు

జగిత్యాల TPUS జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి రాష్ట్ర బాధ్యులు ఒడ్నాల రాజశేఖర్, గుడిసె పూర్ణచందర్, బోయినపల్లి చంద్రశేఖర్, గంప కిరణ్ కుమార్, బీర్పూర్ మండల శాఖ అధ్యక్షుడు చుక్క కిరణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వడ్కాపురం సత్యవంశీ శుభాకాంక్షలు తెలిపారు.


