News October 23, 2024

అనకాపల్లి: ‘ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

image

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సూచించారు. మంగళవారం ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే వ్యవస్థ కార్యకలాపాల్లో భాగంగా భద్రతను పెంపొందించాలన్నారు.

Similar News

News November 23, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

image

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.