News February 17, 2025
అనకాపల్లి: ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డ్ జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2313 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News November 15, 2025
జగిత్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి భార్యను హత్య చేసిన భర్తకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధించారు. మెట్పల్లికి చెందిన వాల్గోట్ కిశోర్(32) భార్య నిషిత(28)ను 28-12-2021న ఇంట్లో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం శిక్షను అమలు చేశారు.
News November 15, 2025
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

* 1935: నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో)
* ఝార్ఖండ్ ఫౌండేషన్ డే
News November 15, 2025
బిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. బిక్కనూర్కు చెందిన తిరుమల రాజయ్య(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


