News February 17, 2025
అనకాపల్లి: ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డ్ జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2313 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News November 20, 2025
సిరిసిల్ల: శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రామ్ దాసు తెలిపారు. PMSRI పాఠశాలల్లోని విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు 11 సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకులు కావాలని పేర్కొన్నారు. కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలారి పాయట్టులో అనుభవం ఉన్న శిక్షకులు ఈ నెల 25 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మార్గంలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. రూ.2, 250 కోట్ల వ్యయంతో 68 కిలోమీటర్ల మేర ఈపీసీ పద్ధతిలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 317 హెక్టార్ల భూసేకరణ చేస్తారు. రహదారి నిర్మాణంతో ప్రయాణ సౌలభ్యం, వ్యవసాయ, వ్యాపార రవాణాకు దోహదపడనుంది.
News November 20, 2025
SAతో వన్డే సిరీస్కు కెప్టెన్ ఎవరు?

SAతో ODI సిరీస్కు IND కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. గాయాల నుంచి కోలుకుంటున్న కెప్టెన్ గిల్, VC శ్రేయస్ ఈ సిరీస్లో ఆడడం కష్టమే. ఈ నేపథ్యంలో KL రాహుల్ లేదా అక్షర్ పటేల్కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. గతంలో KLకు ODIsలో కెప్టెన్సీ చేసిన అనుభవముంది. ఒకవేళ అక్షర్కు అవకాశమిస్తే మరో కొత్త కెప్టెన్ వచ్చినట్లవుతుంది. తొలి ODI ఈనెల 30న జరగనుంది.


