News January 28, 2025
అనకాపల్లి బెల్లం విక్రయాలు.. ఇదే తొలిసారి..!

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం విక్రయాలు జరిగాయి. పలు గ్రామాల నుంచి రైతులు రూ.15,776 బెల్లం దిమ్మలను మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయించారు. ఈ సీజన్లో భారీ స్థాయిలో బెల్లం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే బెల్లానికి డిమాండ్ లేకపోవడంతో ధరలు బాగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్లాగ్ ఫలితాల విడుదల

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.
News October 24, 2025
ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నవంబర్ 1 నుంచి 7 వరకు జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం రేగళ్ల, చాతకొండ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎన్హెచ్ఎం బృందం రానున్నందున ముందస్తు ఏర్పాట్లను, కేంద్రాల స్థితిగతులను పరిశీలించారు. ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
విజయనగరంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 15 మంది యువతకు 45 రోజుల ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నేడు ప్రారంభమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణా బస్సుకు JC సేతు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటి అగ్రహారం RTC శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


