News April 13, 2025

అనకాపల్లి: ‘బ్యాంకు లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం హెచ్చరించారు. UPI పిన్, OTPని బ్యాంకు వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News November 24, 2025

‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

image

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.

News November 24, 2025

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 24, 2025

పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.