News January 29, 2025

అనకాపల్లి: భార్యను హత్య చేసిన భర్త

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త మంచంపై నిద్రిస్తున్న భార్య మెడకు నైలాన్ తాడును బిగించి చంపేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో భర్త నారాయణమూర్తి (43) చేతిలో భార్య వరలక్ష్మి (38) హతమయింది. మృతురాలి అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడపు నాయుడు, ఎస్సై మల్లేశ్వరరావు బుధవారం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 19, 2025

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

image

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News September 19, 2025

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ఈ ఆక్షన్‌లో చేర్చాలి

image

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్ ఢిల్లీలోని బొగ్గు గనుల మంత్రిత్వశాఖలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2025లో జరగే బొగ్గు బ్లాక్ ఈ-ఆక్షన్ ప్రక్రియపై సింగరేణి సంస్థ తరఫున తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్‌లను ఈ-ఆక్షన్ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో మళ్లీ ప్రస్తావించారు. సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.