News February 3, 2025

అనకాపల్లి: మత్స్యకారులకు అందని భృతి

image

చేపల వేట నిషేధానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇప్పటివరకు అందలేదు. ప్రతి ఏటా మాదిరిగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. జిల్లాలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిహారం చెల్లించడానికి అవకాశం లేకుండా పోయింది.

Similar News

News November 13, 2025

జగిత్యాల‌: పుట్టినరోజు నాడే యువకుడి సూసైడ్

image

జగిత్యాల‌కు చెందిన అనుమండ్ల కళ్యాణ్(26) పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన ఇతడు మంగళవారం జన్మదినం సందర్భంగా రోజంతా తమతో ఫోన్ మాట్లాడాడని.. అంతలోనే అర్ధరాత్రి రూంలో ఉరివేసుకున్నాడని తోటి స్నేహితులు తమకు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, తమ కళ్యాణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

News November 13, 2025

రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

image

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్‌డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.

News November 13, 2025

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా కరీంనగర్

image

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.