News February 22, 2025

అనకాపల్లి: మధ్యవర్తుల సమక్షంలో గంజాయి సీజ్ చేయాలి: ఎస్పీ

image

అనకాపల్లి గెజిటెడ్ అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో మాత్రమే గంజాయి సీజ్ చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. శుక్రవారం పట్టణంలోని జీవీఎంసీ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన తదితర అంశాలపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. 161 స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మధ్యవర్తులకు చదివి వినిపించారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రాసెసింగ్ చేయాలన్నారు.

Similar News

News October 20, 2025

ONGCలో 566 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ONGC 566 గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు <>www.iocl.com<<>> వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు డొమైన్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ‌)పై పరీక్ష ఉంటుంది.

News October 20, 2025

ఈ ‘ట్రాప్స్’తో పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

image

వ్యవసాయంలో ప్రకృతి వైపరిత్యాల కంటే ఎక్కువ నష్టం చీడపీడల వల్లే జరుగుతుంది. వీటి నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్, విషపు ఎరలు వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి, సంతతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. వీటిని వినియోగించడం వల్ల రసాయన పురుగు మందుల వినియోగం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి, మిత్రపురుగులకు ఎలాంటి హానీ కలగదు.

News October 20, 2025

అంబాజీపేటలో హోటల్ సీజ్

image

అంబాజీపేటలోని ఓ హోటళ్లో ఫుడ్ తిని 2ం మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లో తనిఖీలు చేసి సీజ్ చేశారు. అనంతరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి వై. రామయ్య పరామర్శించారు. హోటల్లోని మినప్పప్పు, ఉప్పు , మంచినీటిని టెస్టింగ్ కోసం పంపిస్తామన్నారు.