News February 22, 2025
అనకాపల్లి: మధ్యవర్తుల సమక్షంలో గంజాయి సీజ్ చేయాలి: ఎస్పీ

అనకాపల్లి గెజిటెడ్ అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో మాత్రమే గంజాయి సీజ్ చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. శుక్రవారం పట్టణంలోని జీవీఎంసీ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన తదితర అంశాలపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మధ్యవర్తులకు చదివి వినిపించారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రాసెసింగ్ చేయాలన్నారు.
Similar News
News November 13, 2025
ప్రైవేట్ పాఠశాల ఛైర్మన్పై పోక్సో కేసు నమోదు: పరవాడ సీఐ

పరవాడ మండలం పి.బోనంగిలో ఓ ప్రైవేట్ పాఠశాల ఛైర్మన్ విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని అందిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. మాకవరపాలెం మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. పాఠశాల ఛైర్మన్ ఈనెల 8న విద్యార్థినిని తన క్యాబిన్కు పిలిపించుకొని అకారణంగా తిట్టి, చెంపపై కొట్టాడని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 13, 2025
VKB: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి!

వికారాబాద్ జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు) పొందడానికి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
News November 13, 2025
కామారెడ్డి: ఈ ప్రాణాంతక డ్రైవింగ్కు అడ్డుకట్టే వేయరా?

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అపసవ్య దిశలో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా ప్రయాణించే రహదారిపై వాహనదారులు అడ్డంగా రావడంతో ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ అజాగ్రత్త కారణంగా ప్రాణనష్టం, గాయాలపాలవుతున్నారు. అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.


