News February 26, 2025

అనకాపల్లి: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహాశివరాత్రికి అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి కె.పద్మావతి తెలిపారు. కల్యాణపులోవకు అనకాపల్లి డిపో నుంచి 30 బస్సులు, నర్సీపట్నం డిపో నుంచి 45 బస్సులు, దారమట్టానికి నర్సీపట్నం డిపో నుంచి 15 బస్సులు, విజయనగరం జిల్లా పుణ్యగిరికి అనకాపల్లి డిపో నుంచి పది బస్సులు బుధవారం నుంచి 27 సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

image

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News December 1, 2025

ఉద్యోగుల బేసిక్ PAYలో 50% DA మెర్జ్? కేంద్రం సమాధానమిదే

image

ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో DA నుంచి కొంత మొత్తాన్ని మెర్జ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 50% DAను వెంటనే బేసిక్ పేలో కలపాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్‌సభలో సమాధానమిచ్చింది. కాగా ఒకవేళ బేసిక్ PAYలో 50% డీఏ కలిస్తే ఎంట్రీ లెవల్ బేసిక్ పే ₹18వేల నుంచి ₹27వేలకి పెరగనుంది. అటు 8th పే కమిషన్ 2027లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.

News December 1, 2025

సిరిసిల్ల: ‘1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం’

image

సిరిసిల్ల జిల్లాలో 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మొత్తం జిల్లాలోని 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,085 మంది రైతుల నుంచి 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేయాలని ఆమె ఆదేశించారు.