News April 10, 2025

అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

image

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.

Similar News

News December 1, 2025

HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

image

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.

News December 1, 2025

HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

image

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.

News December 1, 2025

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

image

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని MP శ్రీభరత్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పిలా శ్రీనివాసరావు, MLA వెలగపూడి, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో ఈ వంతెన నిర్మించినట్లు ప్రణవ్‌ వివరించారు. త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.