News April 10, 2025
అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.
Similar News
News December 5, 2025
8ఏళ్లైనా పూర్తికాని WGL కమిషనరేట్ పనులు!

కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి 2017లో భూమిపూజ జరిగినా, ఎనిమిదేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో శాఖలకు చాంబర్లు, కార్యాలయాలు లేక ఇబ్బందులు అధికమవుతున్నాయి. పాత హెడ్ క్వార్టర్స్<<18473913>> భవనాల్లో తగిన స్థలం<<>> లేకపోవడంతో CP, DCPలు, అనేక విభాగాలు గదులు పంచుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం ఆలస్యం కారణంగా పోలీసులు రోజువారీ పనుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
News December 5, 2025
VJA: భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్ బాటిళ్లు, 325 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఆలయం వద్ద బారిగేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.


