News April 10, 2025
అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.
Similar News
News September 18, 2025
కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?

కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలోఒకటి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<