News April 11, 2025

అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

image

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.

Similar News

News December 4, 2025

సివిల్ సర్వీసులో విజయం సాధించాలి: భట్టి విక్రమార్క

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రజా భవన్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ డిప్యూటీ సీఎం, సింగరేణి సీఎండీ బలరాం శుభాకాంక్షలు తెలిపారు.

News December 4, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన: కలెక్టర్

image

దేవదాయ శాఖ పరిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వసతి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఈఓలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

News December 4, 2025

తిరుపతి: విద్యార్థులు.. విజ్ఞాన.. విహార యాత్రలు

image

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన.. విహార యాత్రల నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 44 పాఠశాల్లోని 8, 9 తరగతి విద్యార్థులు 6809 మందిని తీసుకెళ్తున్నారు. ఈనెల 10వ తేదీ లోపు శ్రీహరికోట, జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, చంద్రగిరి కోట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.500 కేటాయించింది.