News April 11, 2025

అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

image

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.

Similar News

News April 23, 2025

FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.

News April 23, 2025

గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు 

image

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు

News April 23, 2025

NRPT: ‘క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వహించాలి’

image

ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాకు బదిలీపై వచ్చిన 61 మంది హోమ్ గార్డులతో మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు వున్న నేరుగా తనను కలిసి చెప్పాలని అన్నారు. నిజాయతీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఒక్కరు తప్పు చేసిన డిపార్ట్మెంట్‌కు చెడ్డ పేరు వస్తుందని సూచించారు.

error: Content is protected !!