News February 16, 2025
అనకాపల్లి: మాస్టర్స్ అథ్లెటిక్స్లో మెరిసిన నేవీ ఉద్యోగి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శంభు వానిపాలానికి చెందిన నేవీ ఉద్యోగి అప్పన్న దొర జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా చాటారు. రాజస్థాన్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్లో 45 ఏళ్ల విభాగంలో 4×400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని, 4×100 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కాంస్య పతకం పొందారు. ఆదివారం ఆయనను గ్రామస్థులు సత్కరించారు.
Similar News
News December 5, 2025
ASF: జిల్లాలో మొదటి రాండమైజేషన్ పూర్తి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.
News December 5, 2025
దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు : కలెక్టర్

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టంచేశారు. పెద్దంపేట సర్పంచ్ నామినేషన్ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పర్యటించానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ కోర్టు విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.
News December 5, 2025
రాష్ట్రపతి భవన్కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించడం గమనార్హం.


