News February 5, 2025
అనకాపల్లి: మొబైల్ ఫోన్ల రికవరీ మేళా

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ.కోటి విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తామని తెలియజేసింది. 9వ విడత రికవరీ మేళా నిర్వహిస్తున్నామని వివరించింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందజేస్తారని తెలిపింది.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్లలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎన్నికల నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెండో, మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


