News February 5, 2025

అనకాపల్లి: మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ.కోటి విలువైన మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేస్తామని తెలియజేసింది. 9వ విడత రికవరీ మేళా నిర్వహిస్తున్నామని వివరించింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందజేస్తారని తెలిపింది.

Similar News

News November 14, 2025

మడ్చల్: ఎర్రజెండాతోనే సమస్యల పరిష్కారం: MLA

image

భారత దేశంలో ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని, ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాలతోనే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సమావేశం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా, కూనంనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

News November 14, 2025

కొత్తగూడెం: జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనకు అందజేశారు. కోల్ ఇండియాతో పాటు ఇతర గనుల సంస్థల నుంచి సింగరేణి ఈ గుర్తింపు సాధించింది.

News November 14, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్
✓ గ్రంథాలయ పన్నులు సకాలంలో చెల్లించాలి: అ.కలెక్టర్
✓ మణుగూరు: ట్రాఫిక్ జాం.. 4KM నడిచిన విద్యార్థులు
✓ పాల్వంచ: హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన DMHO
✓ విద్యార్థులు ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి: ఐటీడీఏ పీఓ
✓ ఉపకార వేతనాల కోసం బీసీ విద్యార్థులు అప్లై చేసుకోండి
✓ దుమ్ముగూడెం: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు