News February 5, 2025

అనకాపల్లి: మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ.కోటి విలువైన మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేస్తామని తెలియజేసింది. 9వ విడత రికవరీ మేళా నిర్వహిస్తున్నామని వివరించింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందజేస్తారని తెలిపింది.

Similar News

News October 14, 2025

HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

image

HYD జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్‌రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.

News October 14, 2025

వేములవాడ: భీమేశ్వరాలయంలో దర్శనాలు రద్దు..!

image

వేములవాడ శ్రీ రాజరజేశ్వర స్వామివారి దర్శనాల్లో అధికారులు మార్పులు చేశారు. శనివారం నుంచి భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన దర్శనాలు, మొక్కుల చెల్లింపు వసతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కాగా, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం <<17998071>>LED స్క్రీన్ల ద్వారా రాజన్న దర్శనం<<>> కల్పిస్తోంది. అవసరమైతే LCDల ద్వారా దర్శనాలు చేయిస్తామంది.

News October 14, 2025

HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

image

HYD జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్‌రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.