News March 26, 2025
అనకాపల్లి: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

పీఎం ఉపాధి కల్పన పథకం కింద రుణాలు పొందేందుకు అనకాపల్లి జిల్లాలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షంసున్నీషా బేగం బుధవారం తెలిపారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవారంగానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 21, 2025
అనకాపల్లి: వ్యాధినిరోధక టీకాలు వేయాలి

గర్భిణీలు బాలింతలు పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వీరజ్యోతి సూచించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 21న నిర్వహించే పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
News November 21, 2025
RGM: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

GDK గౌతమీ నగర్కు చెందిన తిరువీధి శ్యాముల్ కిరణ్ (21) సమీపంలోని రైల్వే ట్రాక్ గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు NTPC SI ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. ITI చదువుతున్న అతడు చదువు మధ్యలో మానేయడంతో తల్లిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తిచెంది నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం గౌతమీనగర్ ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నాడు. తండ్రి కొండలరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 21, 2025
వరంగల్లో దిశా కమిటీ సమావేశం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ‘దిశా’ (జిల్లా అభివృద్ధి సహకార & మానిటరింగ్ కమిటీ) సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


