News February 23, 2025
అనకాపల్లి: రూ.14.36 లక్షల నష్టపరిహారం అందజేత

విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లాల మధ్య 108 విద్యుత్ సమస్యలను పరిష్కరించి బాధితులకు రూ.14.36 లక్షల నష్టపరిహారం అందజేసినట్లు సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. సమస్యల సత్వర పరిష్కారానికి 1912 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.
Similar News
News December 6, 2025
ఫిట్నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్నెస్ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.
News December 6, 2025
సిరిసిల్ల: స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరపాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్తో కలిసి హాజరై మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 6, 2025
పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సిద్దిపేటలో కలెక్టర్ కె. హైమావతి, అబ్జర్వర్ హరితల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓల కేటాయింపు జరిగింది. రెండో విడతలో 1973 మంది పీఓలు, 2436 మంది ఏపీఓలు విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


