News March 22, 2025

అనకాపల్లి: రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

GWL: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి- నుషిత

image

గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువే ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం పేర్కొన్నారు. కొత్త పథకం కింద 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు, రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా ఆధార్ తో లింక్ చేసుకోవాలన్నారు.

News November 18, 2025

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: నిర్మల్ ఎస్పీ

image

శీతాకాలం నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారిపై ఓవర్ టేక్‌లు చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రాత్రి, తెల్లవారుజాముల్లో ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 18, 2025

ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్‌తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.