News March 29, 2025

అనకాపల్లి: ‘రెవెన్యూ అధికారుల చర్య కోర్టు ధిక్కరణే’

image

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గధబపాలెం గిరిజనులు సాగు చేస్తున్న భూముల సమస్యపై నర్సీపట్నం కోర్టులో కేసు ఉంది. కాగా ఎమ్మార్వో గిరిజనేతరుల పేరు మీద రికార్డులు బదిలీ చేయడం ముమ్మాటికీ కోర్టు దిక్కరణ చర్యే అవుతుందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ తెలిపారు. ఈ మేరకు శనివారం ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించారు. గిరిజనులకు న్యాయం కోసం తాను కృషి చేస్తానన్నారు.

Similar News

News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News April 22, 2025

టేకులపల్లి: అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

image

టేకులపల్లి మండలం బావోజీ తండాకు చెందిన భూక్య లాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అతనికి రూ.4 లక్షల అప్పు కావడం, ఈ మధ్యలో అతను అనారోగ్యం పాలై వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.

News April 22, 2025

ఏలూరు: ఉపాధ్యాయ పోస్టులకు  అప్లై చేయండి: డీఈవో

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15వ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీఐ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను పరిశీలించాలన్నారు.

error: Content is protected !!