News March 17, 2025
అనకాపల్లి: రైళ్లు ఆలస్యం.. సమాచార కేంద్రం ఏర్పాటు

విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెన కుంగిన నేపథ్యంలో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్రథ్, మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08912746330, 08912744619 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 18, 2025
దిల్సుఖ్నగర్లో యువతులతో వ్యభిచారం.. ARREST

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్సుఖ్నగర్లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
News March 18, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు.. మూడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర తండాకు చెందిన కట్కవార్ రావు సింగ్ 24/10/2021న పొలంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ సదరు వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.
News March 18, 2025
నిర్మల్: అగ్ని వీర్ రిక్రూట్మెంట్కు దరఖాస్తులు

అగ్నిపథ్ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కొరకు జిల్లాలోని అవివాహిత పురుషులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ పరశురాం తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ లేదా స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్, వంటి వివిధ కేటగిరీల్లో నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.